హైదరాబాద్లో బాంబు పేలుడు కలకలం.. పారిశుధ్య కార్మికురాలు మృతి
1 min read
Hyderabad Blast: హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలో బాంబు పేలుడు కలకలం రేపుతోంది. ఆనంద్ నగర్ పారిశ్రామిక వాడలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. పారిశుధ్య సిబ్బంది చెత్త సేకరిస్తుండగా బాంబు ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడులో సుశీలమ్మ అనే పారిశుధ్య కార్మికురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. బాంబు పేలుడపై భిన్న కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.