గువ్వల దొడ్డి లో తల్లితండ్రుల కమిటీ సమావేశం
1 min read
గువ్వల దొడ్డి లో తల్లితండ్రుల కమిటీ సమావేశం.
ఎమ్మిగనూరు, మార్చి 29, (కర్నూల్ ప్రభ న్యూస్) : మండల పరిధిలోని గువ్వల దొడ్డి గ్రామంలో మండల పరిషత్ పాఠశాల నందు తల్లి తండ్రుల కమిటీ సమావేశం జరిగింది ఈ కమిటీని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయుడు బి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మన పాఠశాల నాడు నేడు కార్యక్రమం లో భాగంగా రెండవ విడతలో పాఠశాల సెలెక్ట్ అయిందని అదేవిధంగా మీరందరూ పాఠశాల అభివృద్ధి కొరకు సహాయ సహకారాలు అందించి తోడ్పాటు అందించాలని పాఠశాల హెచ్ఎం తల్లిదండ్రుల సమావేశంలో కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మల్లేష్ విద్యా కమిటీ చైర్మన్ కె వీరేష్ కర్నూలు జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్ లింగన్న, తల్లిదండ్రులు పాల్గొన్నారు.