September 24, 2023

ఎస్ఐ సీఎం రాకేష్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ

1 min read

సంచార జీవులకు నిత్యావసర సరుకుల పంపిణీ

ప్యాపిలి, మార్చి 14, (కర్నూలు ప్రభ న్యూస్) :

ఇనుప పనిముట్లను విక్రయిస్తూ కుటుంబాలను పోషించుకుంటూ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంచార జీవులకు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు అండగా నిలిచారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆరు కుటుంబాలకు ఎస్ఐ సీఎం రాకేష్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రెక్కాడితే కానీ డొక్కా డని సంచార జీవుల దీన స్థితిని గమనించిన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు వారికి కి నిత్యావసర సరుకులను అందజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఒక్కో కుటుంబానికి బియ్యం, కంది బేడలు, వంట నూనె, కూరగాయలు వంటి నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ ను ఎస్ ఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు మత్తు బాబాసాహెబ్, యాడికి పార్థసారథి, తిరుపతయ్య, గాజుల నరసింహులు, జేసీ తిరుపాలు, తాతిరెడ్డి , సుధాకర్ గుప్తా, రమణారెడ్డితదితరులు పాల్గొన్నారు

Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!