September 27, 2023

బిజెపి విజయోత్సవ సంబరాలు..

1 min read

బిజెపి విజయోత్సవ సంబరాలు..

హోళగుంద, ఫిబ్రవరి 11, (కర్నూలు ప్రభ న్యూస్) :

మండల పరిధిలోని గజ్జహళ్ళి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి పెద్ద ఎత్తున బిజెపి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నాలుగు రాష్ట్రాలలో బిజెపి ఘన విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ హోళగుంద మండల ఉపాధ్యక్షుడు చాకలి రామలింగ మాట్లాడుతూ, ఇది ప్రజా తీర్పు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే భారత దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తారన్నారు.వామపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా బిజెపి ప్రజల మద్దతుతో విజయం సాధించింది అన్నారు దేశంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పు స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిందని ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలన కు పనితీరు కూడా ఈ తీర్పు స్పష్టంగా తెలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!